కరోనా వైరస్ మహహ్మారి ( Coronavirus ) విజృంభిస్తున్ననేపథ్యంలో జూలై నెలలో  జరగాల్సిన జేఈఈ 2020 ( Joint Entrance Examination 2020 ) , నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 ( NEET 2020 ) పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర హెచ్ఆర్‌డి మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ తెలిపారు.ఈ పరీక్షలతో పాటు జేఈఈ అడ్వాన్స్‌డ్ టెస్ట్‌ కూడా వాయిదా పడింది. ఈ పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహిస్తాం అని తెలిపారు. వాటికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం దేశ  వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను గమనించి ఈ మార్పలు చేసినట్టు మంత్రి తెలిపారు. కొత్తగా ప్రకటించిన తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. Also Read : PM Modi`s Ladakh visit: ప్రధాని లఢక్ పర్యటనపై స్పందించిన చైనా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jee Neet New Exam Date 2020 : జేఈఈ, నీట్ కొత్త పరీక్షా తేదీలు


హెచ్ఆర్‌డి ( HRD On JEE, NEET 2020 ) విడుదల చేసిన కొత్త షెడ్యూల్‌లో జేఈఈ, నీట్ ( National Elegebility-Cum Entrance Test 2020 ) పరిక్షలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సులకు ఎంట్రన్స్‌కు జేఈఈ మెయిన్ ( JEE Mains ) పరీక్షలు సెప్టెంబర్‌లో 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరుగుతాయి. అయితే జేఈఈ అడ్వాన్స్‌డ్ టెస్ట్ మాత్రం సెప్టెంబర్ 27న జరగనుంది. 


వైద్య విద్యా కోర్సుల కోసం అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ప్రవేశ పరీక్షను సెప్టెంబర్ 13న నిర్వహించనున్నారని మంత్రి ఫోఖ్రియాల్ (HRD Minister Ramesh Pokhriayal ) తెలిపారు. 


జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..